2015年9月24日 星期四

2015-09-25 తెలుగు (India) క్రీడలు


తొలి మ్యాచ్‌ పాక్‌తో..   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్‌ పోరు మరోసారి అభిమానులను అలరించనుంది. సుల్తాన్‌ జొహార్‌ కప్‌ జూనియర్‌ హాకీ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ భారత్‌ తన తొలి మ్యాచ్‌లో పాక్‌ను ఢీకొననుంది. 11న మొదలయ్యే ఈ టోర్నీలో భారత్‌, పాక్‌తోపాటు బ్రిటన్‌, అర్జెంటీనా, ఆసే్ట్రలియా, ఆతిథ్య మలేసియా పోటీ పడనున్నాయి.
పాక్‌తో భారత్ పోరు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
క్యాబ్ బాత్‌హై దాదా!   
Namasthe Telangana
కోల్‌కతా: ఊహించినట్టే జరిగింది. జగ్మోహన్ దాల్మియా మృతితో ఖాళీ అయిన బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్ష పదవికి మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. గురువారం ఇక్కడ సచివాలయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్యాబ్ ఉన్నతాధికారుల సమక్షంలో సౌరభ్ గంగూలీని అధ్యక్షునిగా ప్రకటించారు. మరో కీలక పరిణామం ...

ముందుగానే ముగిసిన ఎన్‌టీపీసీ బాండ్ల ఇష్యూ   సాక్షి
క్యాబ్‌ అధ్యక్షుడిగా సౌరవ్‌   ఆంధ్రజ్యోతి
బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గంగూలీ   Teluguwishesh
Oneindia Telugu   
ప్రజాశక్తి   
అన్ని 35 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
విభజన చట్టంపై ఆదేశాలివ్వలేం: సుప్రీం   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పునర్విభజన చట్టం సరిగ్గా అమలు చేయాలని కేంద్రానికి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన చట్టం సరిగ్గా అమలుకావడం లేదని, అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేశారు. చీఫ్‌ జస్టిస్‌ ...

పార్లమెంటును పర్యవేక్షించలేం   Andhrabhoomi
కేంద్ర, రాష్ట్ర సంబంధాలు సుహృద్భావంగా ఉండాలి   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
మేరీ కంట కన్నీరు..   
ఆంధ్రజ్యోతి
ముంబై: ఒలింపిక్‌ కాంస్య పతక విజేత ఎమ్‌సీ మేరీకోమ్‌ కన్నీరుమున్నీరైంది. బాక్సింగ్‌ సెలెక్షన్స్‌లో, ట్రయల్స్‌లో భారత సెలెక్టర్లు ప్రాంతీయ పక్షపాతం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈశాన్య ప్రాంత క్రీడాకారిణి కావడం వల్లే తనను చిన్నచూపు చూస్తున్నారని.. ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు, బిలియర్డ్స్‌ చాంప్‌ గీత్‌ సేథీతో కలిసి గురువారం ఓ ...

బాక్సింగ్‌ను శాసిస్తున్న ప్రాంతీయతత్వం   Namasthe Telangana
మేరీకామ్‌ కంటతడి   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
బక్రీద్‌, గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు   
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ/రాయదుర్గం: బక్రీద్‌ సందర్భంగా నగరంలో శుక్రవారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్‌ కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 27న సరూర్‌నగర్‌ చెరువులో గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నామని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
సైబరాబాద్‌లో ట్రాఫిక్ జామ్ లేకుండా చర్యలు   Namasthe Telangana
నిమర్జన సమయంలో వాహనాలకు అనుమతి లేని రూట్లు   Telangana99

అన్ని 3 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
రెండో రంజీకి అందుబాటులో   
Namasthe Telangana
న్యూఢిల్లీ: పేసర్ ఇషాంత్ శర్మ విషయంలో డీడీసీఏ (ఢిల్లీ క్రికెట్ సంఘం) తీవ్ర ఆగ్రహంగా ఉన్నా, అతణ్ని ఢిల్లీ రంజీ జట్టులోకి తీసుకోక తప్పలేదు. ఇషాంత్ రెండో రంజీ మ్యాచ్ (అక్టోబర్ 8-11 మధ్య విదర్భతో)కు అందుబాటులో ఉంటానని ప్రకటించడంతో డీడీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. రెండో రంజీ మ్యాచ్‌లో ఆడేందుకు ఇషాంత్ అంగీకరించాడు. కానీ, అతణ్ని ...

ఢిల్లీ జట్టులో ఇశాంత్‌   ప్రజాశక్తి
కాల్ చేస్తే స్పందించని ఇషాంత్: రంజీలో పక్కనెట్టేశారు   thatsCricket Telugu
ఇషాంత్‌కు చుక్కెదురు!   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తిరుమలలో వైభవంగా ధ్వజావరోహణం   
వెబ్ దునియా
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. గురువారం రాత్రి తిరుమలలో ధ్వజావరోహణ కార్యక్రమాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. ఈ నెల 16 నుంచి నేటి వరకూ జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. కొన్ని లక్షల మంది ఈ ఉత్సవాలను తిలకించారు. అశ్వయుజ మాసంలో శ్రీవారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
తిరుమలలో వైభవంగా చక్రస్నాన మహోత్సవం   సాక్షి
శాస్త్రోక్తంగా శ్రీవారికి చక్రస్నానం   Telugu Times (పత్రికా ప్రకటన)
నేడు శ్రీవారి మహారథోత్సవం   Andhrabhoomi
ప్రజాశక్తి   
అన్ని 24 వార్తల కథనాలు »   


సాక్షి
   
సెమీస్‌లో సానియా జోడి   
సాక్షి
గ్వాంగ్జౌ: సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడి గ్వాంగ్జౌ ఓపెన్ మహిళల డబుల్స్‌లో సెమీఫైనల్స్‌కు చేరింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 6-2, 6-3తో అనా-లెనా ఫ్రీడ్‌సమ్ (జర్మనీ), మోనికా నికోలెస్కూ (రొమేనియా) జంటపై సానియా జోడి వరుస సెట్లలో నెగ్గింది. యూఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గిన ఊపులో ఉన్న సానియా, హింగిస్ నేడు (శుక్రవారం) జరిగే ...

సెమీస్‌కు సానియా జోడీ   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


అగ్రస్థానంలోనే సైనా జూ సింధు ర్యాంకు పదిలం   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: టాప్‌ క్రీడాకారులకు షాకిస్తూ.. కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత యువ షట్లర్‌ అజయ్‌ జయరామ్‌.. ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) గురువారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఏడు స్థానాలు ఎగబాకి 25వ స్థానంలో నిలిచాడు. కొరియా ఓపెన్‌ ప్రదర్శనతో అతను మళ్లీ టాప్‌-25లోకి వచ్చాడు.
టాప్‌-25లో జయరామ్‌   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆ వరల్డ్ కప్ ఫైనల్ కు 8 ఏళ్లు పూర్తి!   
సాక్షి
న్యూఢిల్లీ: ప్రస్తుతం ట్వంటీ 20 క్రికెట్ అంటే విపరీతమైన క్రేజ్. 2005 లో తొలిసారి అంతర్జాతీయంగా ప్రవేశపెట్టిన ట్వంటీ 20 మ్యాచ్ లు అనతికాలంలోనే అమోఘమైన ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీంతో ట్వంటీ 20 వరల్డ్ కప్ ను ప్రవేశపెట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. 2007 లో తొలిసారి ట్వంటీ 20 వరల్డ్ కప్ ను ప్రవేశపెట్టారు. దక్షిణాఫ్రికా వేదికగా మొదటి ...

వరల్డ్ టీ20: భారత్ క్రికెట్ చరిత్రలో ఈరోజు ప్రత్యేకత   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言